నర్సాపూర్, డిసెంబర్ 11: ట్రాలీ ఆటో, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన అద్నాన్(18), బస్వరాజ్, పవన్, అమర్, హరి ఏడుపాయల వనదుర్గ మాత దర్శనానికి బైక్పై వెళ్లారు. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన పెద్ద మల్లేశం, చిన్న మల్లేశం, గంగమణి, జ్యోతి, మల్లికార్జున్, లక్ష్మి, రజితతో పాటు మరో 15 మంది కుటుంబ సభ్యులు ట్రాలీఆటోలో తొట్టెల కార్యక్రమానికి బయలుదేరారు.
ఈ క్రమంలో మండలంలోని చిన్నచింతకుంట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి మూలమలుపు వద్దకు రాగానే ట్రాలీఆటో, బైక్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న బసవరాజుతో సహ ఆటోలో ప్రయాణిస్తున్న పెద్ద మల్లేశం, చిన్న మల్లేశం, గంగమణి, జ్యోతి, మల్లికార్జున్, రజిత, లక్ష్మికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు మెకానిక్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.