సిద్దిపేట అర్బన్/కొమురవెల్లి, మార్చి 17: ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి రివిజన్ చేసుకుంటూ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావాలని పేర్కొంటున్నారు.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువు కొనసాగిస్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చు. ము ఖ్యంగా విద్యార్థులు పది సూత్రాలను పాటిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉం టుంది. సబ్జెక్ట్ మీద పట్టు ఉండటంతో పాటు కొన్ని కీలక అంశాలను పాటిస్తే విద్యార్థులకు సులభంగా ఉంటుంది. ఈ కింది పది సూత్రాలను పాటిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
విద్యార్థులు ప్లాన్ ప్రకారం పాఠాల వారీగా, విషయాలు శ్రద్ధగా చదవాలి. ప్రశ్నాపత్రాలను తయారు చేసుకొని వాటికి సమాధానం రాయాలి. ప్రతిరోజూ ఆరు సబ్జెక్ట్లను చదువు తూ.. యూనిట్ టెస్ట్లు, త్రైమాసిక, అర్ధవార్షిక, ప్రీ ఫైనల్ పరీక్షల్లో రాసిన సమాధాన పత్రాలను పరిశీలించి తప్పులను సరిదిద్దుకోవాలి. ఒక హార్డ్ సబ్జెక్ట్ చదివిన తర్వాత సులభమైన సబ్జెక్ట్ను ఎంచుకొని చదువుకోవాలి.
విద్యార్థులు పరీక్షల సమయంలో ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. చిరు తిండ్లు మానుకోవడంతో పాటు మసాలాలతో కూడిన పదార్థాలను తగ్గించుకోవాలి. తేలికపాటి ఆహారమైన ఇడ్లి, ఉప్మా, ఆకుకూరలు, వైట్ రైస్, పప్పు, రసం, మజ్జిగ లాం టివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తింటే నిద్రవచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు ఎక్కువగా తినాలి. పండ్లరసాలు ఎక్కువగా తాగాలి.
ప్రతి విద్యార్థి ఆరు గంటలు తప్పకుండా నిద్రపోవాలి. పరీక్షల సమయమని చెప్పి రాత్రంగా చదువుకొని తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కొని ఉంటే దాని ప్రభావం పరీక్షలపై పడి.. సరిగ్గా రాయలేకపోతారు. అందుకే సరై న సమయానికి పడుకొని.. సరైన సమయానికి నిద్రలేస్తే బాగుంటుంది. ఉదయం లేచి చదివితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం ..అందుకే విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ తాకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు అధికంగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
పరీక్ష జరిగే సమయంలో విద్యార్థులు హాల్ టికెట్ నుంచి అన్ని వస్తువులు ఉన్నాయో.. లేవో ఒకటికి రెండుసార్లు చూసుకొని వెళ్లాలి. పెన్సిల్, రబ్బర్, పెన్నులు, ప్యాడ్, వాటర్ బా టిల్ ఇలా అన్ని ఒకే ప్రదేశంలో ఉంచుకుంటే పరీక్షకు బయలుదేరేటప్పుడు టెన్షన్ పడే అవసరం ఉండదు.
మన ఇంటి దగ్గర నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంటుందో తెలుసుకొని.. ఎం త సమయంలో మనం అక్కడికి చేరుతామో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి. ఏ విధంగా వెళ్తే తొందరగా చేరుకుంటామో దాని కి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. పరీక్షా సమయానికంటే అరగంట ముందే చేరుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయవచ్చు.
పరీక్ష హాల్లోకి వెళ్లగానే రెండు నిమిషాలు ధ్యానం చేయడం చాలా మంచిది. ఒక గ్లాస్ నీరు తాగి మన చుట్టు పక్కల ప్రదేశాన్ని చూసుకోవాలి. మన చుట్టు పక్కల కాగితాలు, చిట్టీలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇన్విజిలేటర్ సూచించిన విధంగా సమాధానపత్రాన్ని రెడీ చేసుకోవాలి. ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివి.. మనకు వచ్చిన సమాధానాలను ముందుగా సమ యం వృథా చేయకుండా రాయాలి. రెండు గంటల సమయంలో మెయిన్ పేపర్ పూర్తి చేసుకొని ఆబ్జెక్టివ్ కోసం వేచి చూడాలి. ఎలాం టి కొట్టివేతలు, అక్షరదోషాలు ఉండకుండా సరిగ్గా చూసుకోవాలి.
సంవత్సరమంతా చదివింది పరీక్ష జరిగే రెండు గంటల్లో రాయాల్సి ఉంటుంది. అందమైన చేతిరాత ఉండే విధంగా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. పెద్ద అక్షరాలను అందంగా రాస్తూ.. హెడ్డింగ్లకు అండర్లైన్ పెడితే బాగుంటుంది. పదానికి, పదానికి మధ్య సమానమైన స్థలాన్ని వదులుతూ.. అవసరం ఉన్న దగ్గర ఫుల్స్టాప్లు, కామా లు ఉండేటట్లు చూసుకోవాలి. సబ్జెక్ట్కు అనుగుణంగా అక్షరాలను అందంగా, ఆకర్షణీయంగా రాయాలి.
పరీక్ష పూర్తయి సమయం ముగిసిన వెం టనే రాసిన పత్రాలను పేజీ నంబర్లు వేసుకుంటూ ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ పేపర్ చివరగా పెట్టి సరైన విధంగా పేపర్ను కట్టుకోవాలి. సమాధానాలు ఏ విధంగా రాశామో చూసుకొని ఒక దాని తర్వాత ఒకటి వచ్చే విధంగా కట్టుకోవాలి. చివరి నిమిషంలో ఎలాంటి టెన్షన్ గురికాకుండా పేపర్ను కట్టుకోవాలి.
పరీక్ష అయిపోయిన వెంటనే పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి తాము రాసిన సమాధానాలు ఇతర విద్యార్థులతో చర్చించి తెలుసుకుంటారు. ఒకవేళ తమ సమాధానం తప్పు అయితే మరుసటి రోజు జరిగే పరీక్ష మీద దాని ప్రభావం పడే అవకాశం ఉన్నందున సమాధానాలపై చర్చించకపోవడం మం చిది. ముందు రోజు సమాధానాలపై ఆలోచిస్తూ.. మరుసటి రోజు పరీక్ష పై దృష్టి పెట్టకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చర్చ జోలికి వెళ్లవద్దు.
టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. పరీక్షల కంటే ముందు, పరీక్షలు జరిగే సమయంలో, పరీక్ష జరిగిన తర్వాత పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం గా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ విద్యార్థులు తమ చదువును కొనసాగించాలి. మనం ఏడాదంతా కష్టపడి చదువుకున్న చదువు వ్యర్థం కాకుండా పైన సూత్రాలను పాటిస్తూ టెన్త్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
– ఎజాస్ అహ్మద్, ప్రముఖ చేతిరాత నిపుణుడు