మెదక్ మున్సిపాలిటీ, జూన్ 4: నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో 487 మంది విద్యార్థులు పరీక్షల రాయనున్నారని, ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్లు పొందని విద్యార్థులు www.bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే 9848214166 నంబర్ను సంప్రదించాలన్నారు.