వెల్దుర్తి, ఆగస్టు 6: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెల్దుర్తిలో నిర్మించిన వంద డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం లబ్ధిదారులకు కేటాయించారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ప్రకాశ్ స్థానిక జడ్పీటీసీ రమేశ్గౌడ్, వెల్దుర్తి సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్గౌడ్, నాయకులు నరేందర్రెడ్డి, ఆంజనేయులు ఆధ్వర్యంలో లబ్ధిదారుల సమక్షంలో చిన్నారుల చేత డ్రా తీసి ఇండ్లు కేటాయించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సమీపంలో గొల్లకుంట వీధిలో 36 సింగిల్ ఇండ్లు, 64జీ ప్లస్వన్ పద్ధతిలో ఇండ్లు నిర్మించారు.
వెల్దుర్తి పట్టణంలో రహదారి వెడల్పు కోసం రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు, దుకాణాలు కూల్చివేతకు గురయ్యాయి. దీంతో లబ్ధిదారులకు తగిన న్యాయం చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు బాధితులు సీఎం కేసీఆర్ను కలిశారు. వెల్దుర్తిలో నిర్మించే డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు ఎమ్మెల్యే మదన్రెడ్డి ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులు, పేదలకు ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. త్వరలోనే మంత్రి హరీశ్రావు, ఎమ్మె ల్యే మదన్రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు.
పేదల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం
రాష్ట్రంలోని పేదల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం . ఇండ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించి ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించడం కోసం కృషిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరలతో సొంతింటి కల నిరుపేదలకు కలగా మిగులుతుందని, సీఎం కేసీఆర్ నిరుపేదల కలను నిజం చేశారు.
– చంద్రాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
నెరవేరిన లబ్ధిదారుల కల
వెల్దుర్తి పట్టణం రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు డబుల్బెడ్ రూం ఇండ్ల కేటాయింపు కల నెరవేరింది. ఇండ్లు కోల్పోయిన వారికి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేసి కేటాయించాం. వెల్దుర్తి పట్టణ ప్రజలు, లబ్ధిదారులకు నేడు పండుగ రోజు. త్వరలోనే మంత్రి హరీశ్రావు సమక్షంలో లబ్ధిదారులందరికీ సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తాం. – ఎమ్మెల్యే మదన్రెడ్డి
డ్రా పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు
వెల్దుర్తి పట్టణంలో నిర్మించిన వంద డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో డ్రా తీశాం. 36 సింగిల్ ఇండ్లు, 64 జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్ల నిర్మాణం జరుగగా డ్రాలో లబ్ధిదారులకు వచ్చిన నంబర్ల ఆధారంగా కేటాయించాం. రోడ్డు వెడల్పు బాధితులతో పా టు మిగిలిన ఇండ్లను నిరుపేదలకు కేటాయిస్తున్నాం.
– శ్యాంప్రకాశ్, తూప్రాన్ ఆర్డీవో