కొల్చారం, డిసెంబర్ 2 : రైతుల కోసమే ఆగ్రోసేవా కేంద్రా లు పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రా న్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రైతులను మోసం చేసే వ్యాపారులపై కేసులు చేసేందుకు ప్రభుత్వం వెనకాడదన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతుకు ప్రతి ఒక్కరూ చేతనైనంత సేవ చేయాలని ఎమ్మెల్యే సూచిం చారు. అనంతరం ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో ఆగ్రో సేవా కేంద్రం యజమానులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ మంజులాకాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాలాసంతోశ్, సర్పంచ్ వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఎంపీటీసీ ఎల్లయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్, నాయకులు పెంటారెడ్డి, తలారి దుర్గేశ్, మోత్కు మల్లేశం, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి, ఏఈవో అంబిక పాల్గొన్నారు.
ఆత్మ కమిటీ డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. శివ్వంపేట మండలం నుంచి ఎన్నికైన ఆత్మకమి టీ డైరెక్టర్లు ఆంజనేయులు, రాంచందర్గౌడ్, లింగరాజును హైదరాబాద్లో ఎమ్మెల్యే సన్మానించారు. పార్టీలో కష్టపడిన ప్రతిఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఆత్మకమిటీ చైర్మన్, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు, స్థానిక నాయకుడు కాముని శ్రీనివాస్ పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. నర్సాపూర్ శివారులో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను ఎ మ్మెల్యే పరిశీలించారు. అయ్యప్ప ఆశీస్సులతో నర్సాపూర్ను అన్నిరంగాల్లో అభివృద్ధ్ది చేస్తానని వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో తాను భాగస్వామిగా ఉంటూ అన్ని విధాలుగా సహకరి స్తానని తెలిపాశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి, ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అశోక్గౌడ్, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్, ఆత్మకమిటీ చైర్మన్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజూయాదవ్, కౌన్సిలర్ రాంచందర్, నాయకులు ఆంజనేయులుగౌడ్, నగేశ్, ఇబ్రహీంఖాన్, నరేందర్రెడ్డి, రాకేశ్గౌడ్, అస్లాం, భూషణం, ఏఎంసీ డైరెక్టర్లు జ్ఞానేశ్వర్, సాగర్, గురుస్వాములు రమేశ్గౌడ్, రమేశ్గౌడ్, కరుణాకర్రెడ్డి, దేవాగౌడ్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.