రామాయంపేట, సెప్టెంబర్ 27: తెలంగాణ గాంధీ కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, పద్మశాలి సంఘం రామాయంపేట అధ్యక్షుడు సత్యనారాయణ, నాగరాజు, ప్రభాకర్, రమేశ్ అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంతో పాటు మార్కండేయ దేవాలయంలో పద్మశాలి లతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు సుధాకర్, మద్దెల భరత్, రాము,బల్ల యాదగిరి, మురళీ, మానెగల్ల వెంకటి, అంబటి లక్ష్మణ్, శ్రీనివాస్, రామ చంద్రం, తిర్మల్, గోపి, నర్సింహులు, తిరుపతి తదితరులున్నారు.
కొల్చారంలో..
కొల్చారం, సెప్టెంబర్ 27: మండల పరిషత్ కార్యాయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎంపీపీ మంజుల, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎంపీవో కృష్ణవేణి, ఏపీవో మహిపాల్రెడ్డి , ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్,సెప్టెంబర్ 27:స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాల యంలో తహసీల్దార్ సహదేవ్,సిబ్బంది బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్,సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని నర్సాపూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోఎంపీడీవో మార్టీన్ లూథర్, ఎంపీపీ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింగరావు, ఎంపీటీసీ శ్రీనివాస్ ,అధికారులు పాల్గొన్నారు.
మనోహరాబాద్లో..
మనోహరాబాద్, సెప్టెంబర్ 27: మనోహరాబాద్, శివ్వంపేట మండలాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మనోహరాబాద్ ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నవనీతరవి, శివ్వంపేటలో ఎంపీపీ హరికృష్ణ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లులర్పించారు.