పుల్కల్, సెప్టెంబర్ 16: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని సింగూరు, బస్వాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. సింగూరు ప్రాజెక్టులో 1.64 లక్షల చేప పిల్లలు, రొయ్య పిల్లలను సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేతో కలిసి వదిలారు. మత్స్య సంపదను పెంచడంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.
అనంతరం బస్వాపూర్ శివారులో రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లడంతో కెనాల్ కాల్వపై బస్వాపూర్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 6 మండలాలకు చెందిన లబ్ధిదారులు 500 మందికి దివ్యాంగుల పెన్షన్, 53మందికి మైనార్టీ బంధు చెక్కులు, 32మందికి ఇండ్ల పట్టాలు, 95 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, 419 మందికి ఇనాం భూముల పట్టాలు అందజేశారు. అభివృద్ధికి ఆకర్షితులైన మునిపల్లి, పుల్కల్ మండలాలకు చెందిన 40 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు.
పార్టీలోచేరిన వారిలో నాయకులు మాణిక్రెడ్డి, అఖిల్రెడ్డి, ఇందూరి మోహన్, కమ్మరి తుల్జారాం, ఈశ్వరప్ప, రాములు, భాస్కర్, నగేశ్, మొగులయ్య, రమేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మునిపల్లి జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్, మత్స్యశాఖ ఏడీ సతీశ్కుమార్, ఎంపీపీ చైతన్య విజయ్ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల విజయ్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.