పోలీసులకు విధులతో పాటు ఆటవిడుపూ ముఖ్యమే..గెలుపోటములు కాకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలి ఆటలతో ఒత్తిడిని అధిగమించొచ్చు..మానసిక, ప్రశాంతత కోసం స్పోర్ట్స్ మీట్ మెదక్లో జెండా ఊపి వార్షిక క్రీడలను ప్రారంభించిన ఎస్పీ రోహిణిప్రియదర్శిని పాల్గొన్న వివిధ స్థాయి అధికారులు నిత్యం పనిఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. పట్టణ శివారులోని అవుసులపల్లి వద్ద పోలీస్ గ్రౌండ్లో జిల్లా వార్షిక స్పోర్ట్స్ మీట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపించాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సారి ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.
మెదక్, ఏప్రిల్ 20: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం పట్టణ శివారులోని అవుసులపల్లి వద్ద ఉన్న నూతన పోలీసు గ్రౌండ్లో మెదక్ జిల్లా వార్షిక క్రీడా పోటీలను ఎస్పీ క్రీడా జెండా ఎగురవేసి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్ జిల్లా పోలీసు మైదానంలో కోలాహాలంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు, పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో దిగారన్నారు.
ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు, ఇలా హోదాలు పక్కన పెట్టి తమ జట్టును గెలిపించుకునేందుకు కలిసి కట్టుగా పోరాడాలని సూచించారు. మానసిక, ప్రశాంతత కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో బాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్, టెన్నికాయిట్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు నూరపు నాయుడు, నాగేశ్వర్రావు, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, మెదక్ పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్కుమార్, అల్లాదుర్గం సీఐ జార్జ్, నర్సాపూర్ సీఐ షేక్లాల్మదర్, తూప్రాన్ సీఐ శ్రీధర్, ఆర్ఎస్ఐలు నరేశ్, భవానీకుమార్, మహిపాల్, పీఈటీలు శ్యామ్, మధు, నరేశ్, వినోద్, రవి పాల్గొన్నారు.