కాసిపేట, మార్చి 16 : సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాలకు భద్రత ఉంటుందని దేవాపూర్ ఎస్ఐ విజయేందర్ పేర్కొన్నారు. మంగళవారం పల్లంగూడ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయేందర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు అన్ని గ్రామా ల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముం దుకొచ్చి తమ వంతు సహకారం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ దుస్స విజ య, ఎంపీటీసీ చంద్రమౌళి, మాజీ సర్పంచ్ చందు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దండేపల్లి, మార్చి 16 : మహిళల భద్రత, రక్షణకు మేమున్నామంటూ షీటీంలు మహిళలకు భరోసానిస్తున్నాయని ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు షీటీంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులకు ఏ సమస్య ఎదురైనా నిర్భయంగా షీటీంకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ అజ్మీరా సుగుణ, ప్రొబెషనరీ ఎస్ఐ సంధ్య, ఏఎస్ఐ పున్నం, ప్రిన్సిపాల్ అనిలా, విద్యార్థులు ఉన్నారు.