“హరితహారం విజయవంతం చేయడానికి గ్రామస్థాయిలో సర్పంచ్లు, జీపీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులు ఇప్పటి నుంచే కష్టపడాలి. ఒకటి, రెండు వర్షాలు పడగానే ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. నర్సరీలో మొక్కలు ఏపుగా పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.”
హరితహారం నాటికి మొక్కలు అందిస్తాం..
హరితహారానికి మొక్కలు అందించే లక్ష్యంతో ఈజీఎస్ ఆధ్వర్యంలో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మండలంలో 30 జీపీల్లో ఈజీఎస్ ఆధ్వర్యంలో, ఒక జీపీలో అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి 4.96 లక్షల మొక్కలు పెంచుతున్నాం. 2.39 లక్షలు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కోరుకునే మొక్కలకు ప్రాధాన్యమిస్తున్నాం. ప్రతి ఇంటికీ ఆరు చొప్పున మొక్కలు అందించేలా, మండలానికి అవసరమయ్యేలా మొక్కలు పెంచుతున్నాం. ఇవేకాకుండా రైతులు పొలం గట్లపై నాటుకునేందుకు టేకు మొక్కలు సిద్ధం చేస్తున్నాం. ప్రతిరోజూ నర్సరీలకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాం. హరితహారం నాటికి మొక్కలు అందిస్తాం.