పాలమూరు, జనవరి 21 : డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట్లాడారు. డబుల్బె డ్రూం ఇండ్లతోపాటు వ్యవసాయ బోరుబావులకు విద్యు త్ కనెక్షన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. అలాగే తాగునీటి పైపులైన్ల లీకేజీల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాగా నవాబ్పేట మండలంలోని కారుకొండ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని జెడ్పీటీసీ రవీందర్రెడ్డి కోరారు. గండీడ్ మండలం రంగారెడ్డిపల్లి బీటీరోడ్డు నిర్మాణం ఏడేండ్లుగా పెండింగ్లో ఉందని, కొత్త కాంట్రాక్టర్కు పనులను అప్పగించాలని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, అన్నపూర్ణ కోరారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ఒకటో స్థాయీసంఘం సమావేశంలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. పైపులైన్ నిర్మాణానికి రోడ్లను తవ్వి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రోడ్లకు మరమ్మతు చేయించాలని సూచించారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతోపాటు పైపులైన్ లీకేజీలను అరికట్టాలని కోరారు.
సాంఘిక సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని స్థాయీసంఘం చైర్మన్, బాలానగర్ జెడ్పీటీసీ కల్యాణి అ న్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరులో జాప్యం చేయొద్దన్నారు. హాస్టల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని, విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాలానగర్ హాస్టల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జ్యోతి ఉన్నారు.