మహబూబ్నగర్, నవంబర్ 17 : నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఈ-ఓటర్ జా బితా తయారీపై మహబూబ్నగర్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వికా స్రాజ్ మాట్లాడుతూ ఓటర్ జాబితా నుంచి ఎవరిదైనా పేరు తొలగించాల్సి వస్తే.. సంబంధిత ఇంట్లోని వ్యక్తితో ఫారం-7పై తప్పనిసరిగా సంతకం తీసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు వెళ్లిన ఓటర్లను ధ్రువీకరణ పత్రం ఆధారంగా తొలగించాలన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి అవగాహన కల్పించి ఓటరు నమోదు చేసుకునేలా చూడాలని ఆ దేశించారు. ఈ విషయంపై ప్రతి కళాశాల, పాఠశాల స్థాయిలో ఒక పాయింట్ పర్సన్ను నియమించి 18, 19 ఏండ్లు నిండిన వారి జాబితాను తయారు చేయాలన్నారు.
పట్టణా ల్లో మెప్మా గ్రూపులు, వార్డ్ ఆఫీసర్లను భాగస్వాములను చేయాలన్నారు. అభ్యంతరాలను 24 గంటల్లోగా పరిష్కరించాలని సూ చించారు. ప్రతి దరఖాస్తును క్షుణంగా పరిశీలించాలన్నారు. ఇతర నియోజకవర్గంలో ఉంటూ.. ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకుంటే పూర్తి స్థాయిలో ఫారం పూర్తి చేసిన త ర్వాత ఈఆర్వోకు ఎన్వీఎస్వీలో పంపించాలని తెలిపారు. ఈఆర్వోలు ఓటరు జాబితాపై ప్రతిరోజూ అరగంట సమయం కేటాయించాలని ఆదేశించారు. ఓటరు నమోదు కోసం వ చ్చిన ఫారంలను డిసిగ్నేటెడ్ ఆఫీసర్లు పరిశీలించాలన్నారు.
జిల్లాలో నివాసం ఉంటున్న ఓటర్ల నమోదు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. రానున్న 30, 45 రోజులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతకుముందు మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, అర్బన్ మండలంలోని గ్రామాల్లో ఆన్లైన్ దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా ప్రక్రియ సక్రమంగా నిర్వహిస్తుండడంతో బీఎల్వోలను అభినందించారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బీఎల్వో, వార్డ్ ఆఫీసర్లు ఫారం-6బీతో ఇంటింటికీ వెళ్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్పవార్, సీతారామారావు, వనపర్తి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లాల ఆర్డీవోలు, ఈఆర్వోలు పాల్గొన్నారు.