వనపర్తి, నవంబర్ 27 : బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో సోమవారం పలు కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ పలకరింపులో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎవరికీ ఏ అవసరం వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందిస్తానన్నారు. కార్మిక సంఘాలకు కావాల్సిన భవనాలను ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేశామని మరికొన్ని త్వరలోనే చేపడుతామన్నారు. ప్రభుత్వం పేదల కోసం గ్యాస్ ధరను సబ్సిడీ కింద రూ.400లకే ఇవ్వనున్నదన్నారు. రాష్ట్రంలో రైతులకు మేలు జరిగితే దానికి అనుసంధానంగా అనేక కార్మిక వ్యవస్థలకు ఉపాధి లభిస్తుందన్న ఆలోచనతో వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని, దానితో మార్కెట్ యార్డులోని కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు.
అలాగే రైతు బీమా తరహలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమాను అందించనున్నారన్నారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను తప్పా ఎవరి లాభపేక్షం చేయడం లేదన్నారు. కొత్త మార్కెట్ యార్డులో కావాల్సినంత స్థలం ఉంది, అక్కడ కార్మికులకు కావాల్సిన వసతుల కోసం తోడ్పాటునందిస్తామన్నారు. అలాగే పాత మార్కెట్లో కూడా వారికి కావాల్సిన దానిపై కూడా దృష్టి సారించి ఏర్పాటు చేసుకుందామన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరూ కార్యదక్షతతో బంధువులు, స్నేహితులను కలిసి ఈనెల 30న కారుగుర్తుకు ఓటు వేసేలా శ్రమించాలన్నారు. దీనికి ఐదేండ్లులో కష్టపడి నియోజకవర్గాన్ని పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. నాకు తోడుగా మాజీ ఎంపీ రావుల ఉన్నారని, ఏ సమస్య అయి నా ఆయన సలహా సూచనలతో ముందుకు వెళ్తానన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు ఇద్దరం అందుబాటులో ఉండి ప్రజలకు మరిన్ని సేవలందిస్తామన్నారు.
మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఐదేండ్లుగా గతంలో జరగనంత అభివృద్ధిని వనపర్తిలో నిరంజన్రెడ్డి చేసుకొచ్చారన్నారు. సమస్యలన్నింటిని మంత్రి తీరుస్తారని మీరందరికీ వాగ్ధానం చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన వెంట ఉండి చేయించుకుందామన్నారు. ఇలాంటి నాయకుడిని మనందరం మరోసారి గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకొవాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలోనే ఆటో యూనియన్ సంఘానికి స్థలం తీసుకున్నామని దాని నిర్మాణానికి తోడ్పాటునందిస్తారన్నారు. మీ పనులు చూసుకుంటునే బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కొంత సమయం వెచ్చించి కారుగుర్తుకు ఓటు వేసేలా మనందరం కష్టాపడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్, మార్కెట్ రాష్ట్ర డైరెక్టర్ విజయ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు తిరుమల్, నీలస్వామి, పలు కార్మికుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
పెబ్బేరు, నవంబర్ 27 : అన్ని వర్గాల అభున్నతికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పెబ్బేరులో పలు సంఘాలు, పార్టీలకు చెందిన 300మంది నాయకులు సోమవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సగర, ఆరెకటిక, బొలేరో వాహన సంఘాల నుంచి వచ్చిన వారు, శాఖాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను నియోజకవర్గంలో ఏ వర్గాన్ని విస్మరించలేదన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తన వంతుగా చేయూతనందించానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షడు దిలీప్రెడ్డి, నాయకులు బుచ్చారెడ్డి, ఆంజనేయులుసాగర్ పాల్గొన్నారు.