భూత్పూర్, నవంబర్ 25 : అభివృద్ధిని చూ సి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శ లు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివా రం మున్సిపల్ కేంద్రంతోపాటు అమిస్తాపూర్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ భూత్పూర్ మండలమే నాకు మొదటగా రాజకీయ గుర్తింపును ఇచ్చిందన్నారు. 2006 జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు 4,438ఓట్ల మెజార్టీతో గెలిపించారని, టీఆర్ఎస్ పార్టీ తరఫున 2014లో మొదటిసారి ఎమ్మెల్యేకు పోటీ చేస్తే 7,500ఓట్ల మెజార్టీని ఇచ్చారని, రెండోసారి ఎమ్మెల్యేకు పోటీ చేస్తే 10,500 మెజార్టీని ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మండల ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చడానికే కరివెనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకువచ్చానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా నేను ఏం పనిచేయలేదని విమర్శిస్తున్నాడు. నేను అభివృద్ధి చేశానో లేదో నీ సొంత మండలంలో నీ గ్రామంలో వెళ్లి అడుగు నేను ఏమి అభివృద్ధి చేశానో చెబుతారు.
మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దిట్ట ఆయన గెలిస్తే దేవరకద్ర నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, వైస్చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, గడ్డంనాగమ్మ, రామకృష్ణ, కృష్ణవేణి, బాలకోటీ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కోఆప్షన్లు అజీజ్, జాకీర్, మాజీ సర్పంచులు నారాయణగౌడ్, సత్యనారాయణ, నాయకులు మురళీధర్గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, సురేశ్గౌడ్, బాలస్వామి, అశోక్గౌడ్, గడ్డంరాములు, నర్సింహులు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.