మహబూబ్నగర్ అర్బన్, జనవరి 31 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూవా రికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలో ని పాతపాలమూరుకు చెందిన ఖాదరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విష యం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవా రం అందజేశారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. త్వరలోనే గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.