మహబూబ్నగర్, నవంబర్ 27 : అందరికీ తెలిసిన సా మెతమాదిరిగా ఎవరికీ తెలియదన్నంటూ బీజేపీ, కాంగ్రెసోళ్లు దొంగలు అయి ఉండి దొంగ దొంగ అంటూ ఆరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. బీజేపీ పార్టీ పూర్తిగా కుల రాజకీయాలు చేస్తున్నదని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే బీసీనీ సీఎం చేస్తామంటున్న బీజేపీ ఉత్తరాది రాష్ర్టాల్లో బీసీలను ఎందుకు సీఎం చేయడం లేదని ప్రశ్నించారు. ఎలాగైన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు? ఏమి చెబితే ఏమి ఇబ్బంది ఉండదని బీజేపీ పక్కాగా ప్లాన్ చేస్తూ ప్ర జలను మభ్యపెడుతున్నారని తెలిపారు. సరిగ్గా నెల రో జుల కిందట వరకు బీజేపీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్య ర్థి నేడు వచ్చి కుల, మతం చిచ్చు పెడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆనాడు ఇబ్రహీంకు ఓటేస్తే మీరు పాకిస్తాన్కు ఓటేసినట్లు చెప్పి పార్టీ మారిన వెంటనే మా ఓటు మాకు కావాలి అని అడగడం ఎంత వరకు సమజసమన్నారు. ముస్లింలు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి విధానాలను పూర్తిగా గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రెడ్డి నాన్రెడ్డి అంటూ ప్రచారం చేసుకుంటు కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. అందరం కుటుంబ సభ్యులుగా జీ వనం సాగిస్తున్న మహబూబ్నగర్లో లేనిపోని కులమతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డి, మిథున్రెడ్డిలకు అహంకారపు డీఎన్ఏ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలంటే రేవంత్రెడ్డికి చిన్న చూపని, అందుకు చేతి వృత్తుల వారు వారి కుల వృత్తులు చేసుకుని జీవించాల ని, వారికి రాజకీయాలు ఎందుకని గతంలో మాట్లాడారన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానని పీసీ సీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎంతో అహంకారంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఉదయం నుంచి బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాపై ఇలా దుర్మారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపా రు. ఒక్క ఇంచులో భూమి కబ్జా చేస్తే కోర్టులు, మీడి యా వద్దకు వెళ్లే అవకాశం ఉన్న ఈ రోజుల్లో భూము లు, ఆస్తులు కబ్జా చేసేందుకు అవకాశం ఉంటుందా ? అని ప్రశ్నించారు. తనపై తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. రేవంత్రెడ్డి ఎం త పొలం దున్ని, పనిచేసి ఇంత సంపాదించారని, కోట్ల ఆ స్తులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. చీటిం గ్, రౌడీ షీటర్లు, కబ్జాలకు పాల్పడిన వాళ్లు వారి దందా నడపడం లేదని, కాంగ్రెస్ వారితో జతకట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. అందరూ వారిలా చిల్లమల్లరగా ఉండరని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన చరిత్ర తమదన్నారు.
గిప్పుడు ఎన్నికలప్పుడు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది కాదని, రైతుబంధును ఆపి కాంగ్రెసోళ్లు సంబురపడుతున్నారని ఇది సరియైన విధానం కాదని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. రైతుబంధుతోపాటు రైతుబీమా, కల్యాణలక్ష్మి, బీసీ బంధు, దళితబంధు, వంటి పథకాలన్ని అప్పటికే ఉన్న పథకాలని ఆపి ఏం సాధిస్తారన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్న ఆరాచకాలు చూడండని, తినే అన్నంలో మన్ను పోసే రకం వా రని విమర్శించారు. కౌలు రైతులకు పంట సాయం అం దిస్తామని చెప్పుడుతున్న రేవంత్రెడ్డి మాటలకు రేపు కౌ లుకు భూములు ఇవ్వడం జరుగుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి 2, 3 సీట్లు కూడ రావని, గిది గమనించకపోగా లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. మహబూబ్నగర్ ను పాలమూరు మార్చుతాం ఇలా చెత్త అంటు బీజేపీ నేత లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అవసరమైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇస్తాం.. మంచిగా చేస్తాం ప్రజలను సుఖసంతోషాలతో జీవించే లా చేస్తామని మర్చి కేవలం కులమతాలకు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆరోపనలు చేస్తున్నారని ఇది సరియై న విధానం కాదన్నారు. ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్లో దశ దిశలా జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. 14 రోజులకు ఒక మారు తాగునీరు వస్తున్నా మహబూబ్నగర్కు వచ్చి ఆనాడు ఏ ఒక్కరు ఎందుకు మంచిగా చేయలేదన్నారు. గిప్పుడు మంచిగా అవుతున్న మహబూబ్నగర్కు వచ్చి మరింత మంచిగా జరిగితే తమ ఆగడాలు జరుగవని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమి చేస్తాం.. ఏమి చేయాలి ? అని అడగాలి అంతేకాని ఊరికే వచ్చి పోయి ఏవో మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులో లేరన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై తప్పుడు ఆరోపనలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదన్నారు. కర్టాటకలో బీజేపీ ప్రభుత్వ పూర్తిగా విఫలం కావడం జరిగిందని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కొరమోని వెంకటయ్య, మూడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రకాశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, బాబుల్రెడ్డి ఉన్నారు.