మహబూబ్నగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి)/కోస్గి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాడుదామ ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలపై కోస్గిలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఓడినా, గెలిచినా మనం ప్రజలవైపే ఉండాలన్నారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభు త్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిందని, మ రి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బీజేపీ సర్కా రు పేదల నడ్డి విరిచిందని, 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో పూర్తికావాల్సిన కరివెన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందని మండిపడ్డారు. కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం ప డుతున్న కష్టాల గురించి వార్తలు రాస్తే జర్నలిస్టుల కు బెదిరింపులు వస్తున్నాయన్నారు.
ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని అవ్వతాతలను, నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను మోసం చేశారన్నా రు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగడానికి వస్తే నా లుగు నెలలకు కలిపి రూ.10 వేలు ఇవ్వాలని డి మాండ్ చేయమని ప్రజలకు సూచించారు. ము ఖ్యంగా నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎం రేవంత్ అంటే.. అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాడని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయడం చేతగాక ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. హకీంపేట, ఎర్రంపల్లి వంటి నాలుగు గ్రా మాల రైతుల భూములను ఫార్మా కంపెనీ కోసం లాక్కుంటున్నారన్నారు. పొల్యూషన్ కంపెనీ మాకొద్దని ప్రజలు అంటున్నా పట్టించుకోవడం లేదని, వారి భూముల జోలికి వచ్చినా, కార్యకర్తలను వే ధించినా ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయాలంటే మన్నెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, నాయకులు సలీం, శాసం రామకృష్ణ, బాలరాజు, మహిపాల్, వెంకట్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.