బిజినేపల్లి, జనవరి 31: అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశా రు. మండలంలోని వెల్గొండ గ్రామంలో గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్లో భాగంగా మంగళవారం వీధుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామంలో ప్రధానంగా ఆసరా పింఛన్లు, రేషన్కార్డు, ఇండ్లు, భూ, విద్యుత్, రోడ్లు, డ్రైనే జీ సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. కొ న్ని సమస్యలు సంబంధిత అధికారులతో మా ట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఉగాది నుంచి ఇండ్లు లేని వారు సొంత జాగాలో ని ర్మించుకునేందుకు రూ.3లక్షలు అందజేస్తామన్నారు. ప్రతి మండలంలో గుడ్మార్నింగ్ నా గర్కర్నూల్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నీ తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చై ర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, సర్పం చ్ కుర్వమ్మ, మల్లేశ్, తదితరులున్నారు.