దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), డిసెంబర్ 13 : నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను నా కుటుంబ సభ్యులుగా కంటికిరెప్పలా కాపాడుకుంటూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. నియోజకవర్గ ప్రజలు పదేండ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారని,
భవిష్యత్లో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించి నూటికి నూరు శాతం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. పదేండ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు ప్రతి గామాన్ని సందర్శించి బీఆర్ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము, నాయకులు ప్రదీప్కుమార్గౌడ్, కరుణాకర్రెడ్డి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.