యాసంగి పంటల సాగుకు నీటి ఢోకా లేదు. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎంజీకేఎల్ఐతో పాటు జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని లిఫ్టులు నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నాయి. దీంతో రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయికి నిల్వలు చేరగా.. చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తుండగా.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
నాగర్కర్నూల్, నవంబర్ 17 (నమస్తే తె లంగాణ) : నీటి చుక్క కోసం ఎదురుచూసిన పాలమూరు నేలల్లో నేడు పుష్కలంగా సాగునీరు పారుతున్నాయి. నెర్రెలుబారిన చో ట పచ్చని పంటలు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేశారు. దీంతో సా గునీటి సమస్య తీరింది. అలాగే ఈ ఏడాది ఎ న్నడూ లేనంతగా అ ధిక వర్షపాతం న మోదైంది. భారీ వర్షాలు కురవడంతో చెరువు లు, కుంటల్లో నీటి మట్టాలు గరిష్ఠానికి మిం చాయి. ఎంజీకేఎల్ఐతోపాటు జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా కాలువల్లో నీళ్లు పారుగుతున్నాయి. దీనికితోడు వర్షాలతో నిండిన చెరువులు కొన్నిచోట్ల ఇప్పటికీ అలుగులు పారుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో సాధారణ వర్షపాతం 563 మిల్లీమీటర్లు ఉండగా.. గతేడాది 572.3 మి.మీ కురిసింది. ఈ ఏడాది 818.1 మి.మీ. నమోదు కావ డం గమనార్హం. ఈ వర్షాలకుతోడు కాలువల్లో నీ ళ్లు పుష్కలంగా పారుతుండడంతో రైతులు వానకాలంలో సాగు సంబురంగా చేపట్టారు. చెరువు లు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను త లపిస్తుండడంతో యాసంగికి కూడా సాగునీటికి కష్టాలు తీరాయి. ఈ సీజన్లో రైతులు వేరుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కం దులు, శనగలు వంటి పంటలను సాగు చేస్తున్నా రు. భూగర్భ జలమట్టాలు సైతం భారీగా పెరిగా యి. బోర్లల్లోనూ పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. దీంతో యాసంగి సాగుకు నీటి ఇక్కట్లు తీరాయి.
ఇదిలా ఉండగా, ఈ వానకాలంలో చెరువులు మత్తడి దుంకాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని దుందుభీ వాగు చాలా రోజులపాటు పారింది. ఈ వాగు జడ్చర్లతోపాటు ఉప్పునుంతల వరకు ఉన్న ప్రాంతాల రైతులకు వరప్రదాయినిగా మారింది. వీటితోపాటు నాగర్కర్నూల్లోని కేసరి సముద్రం, నాగసముద్రం, పాలెం పెంటోనిచెరువు, తెలకపల్లి, వడ్డెమాన్, నేరెళ్లపల్లి చెరువులు, తాడూరులోని దాదాపు అన్ని చెరువుల్లో భారీగా నీరు చేరుకున్నది. ఇప్పటికీ చాలా చెరువులు మత్తడి దూకుతుండడం గమనార్హం. నీటి పారుదల శాఖ అధికారుల వివరాల మేరకు.. జిల్లాలో 2,208 చెరువులు ఉన్నాయి. ఇందులో 937 చెరువులు 75 నుంచి 100 శాతం నీటితో నిండి ఉన్నాయి. 496 చెరువులు మత్తడి దూకుతుండటం విశేషం. 25 శాతం నీటితో 67 చెరువులు, 50 శాతం నీటితో 227 చెరువులు, 75 శాతం నీటితో 481 చెరువులు ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో గరిష్ఠస్థాయిలో నీటి నిల్వ ఉండడంతో కొల్లాపూర్ మండలం ఎల్లూరు నుంచి మిషన్ భగీరథకు వచ్చే ఎండాకాలం నాటికి సరిపడా నీళ్లను అందించే స్థాయిలో ఉన్నది.
చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు..
జిల్లాలో చెరువులు నీటితో కళకళలాడుతున్నా
యి. ఈ వానకాలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎంజీకేఎల్ఐ నుంచి నీళ్లు నిరంతరా
యంగా దిగువకు విడుదలవుతున్నాయి. దీంతో నాగర్కర్నూల్ జిల్లాలోని 2,208 చెరువులకు గాను దాదాపుగా 500 చెరువులు మత్తడి దూకుతున్నాయి. దాదాపు వెయ్యి చెరువులు వంద శాతం నీటితో ఉన్నాయి. ఈ వర్షాలతో యాసంగి సీజన్లో సాగుకు నీటి కష్టాలు తీరాయి.
– రమేశ్, డీఈ, నాగర్కర్నూల్