మాగనూర్ మార్చి 29 : సంగబండ రిజార్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోవడంతో లోలెవెల్, హైలెవెల్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాటుకాల్వలు వట్టిపోవడంతో పంటలు ఎండు మొఖం పడుతున్నాయని ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయకట్టులో వరి పంటలు పొట్టదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మరో పక్క ఎండల తీవ్రత కూడా పెరగడంతో సాగునీటి సరఫరాపై రైతులను మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింది ప్రస్తుతం యాసంగిలో 12వేల ఎకరాలు వరిసాగు చేశారు. వానకాలంలో అయితే 50వేల ఎకరాల సాగు చేస్తారు.
సం గంబండ రిజర్వాయర్ ప్రాజెక్టు గేట్లు లీకేజీలతో సగం సాగునీరు వృథాగానే పోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోయాయి. లెఫ్ట్ హైలెవెల్ కాల్వకు పూర్తిగా సాగునీరు అందకపోవడంతో లెఫ్ట్ లోలెవెల్ కాల్వ నుంచి హైలెవెల్ కాల్వలోకి 5 మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తుండడంతో లో లెవెల్ కాల్వ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎం డిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో లోలెవెల్ కాల్వకు కూడా సాగునీరు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మరో పక్క కాల్వ వెంబడి వందల సంఖ్యలో రైతులు10హెచ్పీ మోటర్లు పెట్టి పంటలకు సాగునీరు పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క ప్రభు త్వం రైతులకు ఆందిస్తున్న 24కరెంట్ను 14గంటలు మాత్రమే చేసి అదికూడా 10గంటలు సరఫరా చేస్తుండడంతో సాగునీరు అం దడంలేదని వాపోతున్నారు. కరెంట్ సరఫరా లేని సమయంలో కాల్వ వెంబడి ట్రాక్టర్, జనరేటర్లు పెట్టి రైతులు సాగునీటి కోసం అదనంగా వేల రూపాయాలు ఖర్చు చేస్తున్నా పంటలు చేతికోస్తాయో లేదో ఆని ఆందోళన చెందుతున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికైనా రైతుల పంటలను దృష్టిలో ఉంచుకొని కృష్ణానదిలో వచ్చే నీటిని గోప్లాపూర్ పంపుహౌస్ నుంచి సంగంబండ రిజర్వాయర్కు విడుదల చేయించి వరి పంటలను కాపాడాలని మాగనూర్, కృష్ణ మండలాల రైతులు కోరుతున్నారు.