వనపర్తి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)/కొత్తకోట : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో నెంబర్వన్గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే పుట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు. గురువారం కొత్తకోట మండలం కనిమెట్ట, పాత జంగమాయపల్లి వద్ద ఊకచెట్టు వాగుపై రూ.12.30 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. కనిమెట్ట గ్రామంలోని సీసీ రోడ్డు, యాదవ కమ్యూనిటీ హాల్, రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద రూ.2 కోట్లతో సమీకృత కూరగాయలు, మాంసం విక్రయాల మార్కెట్కు భూమి పూజ పూజ చేశారు. ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చే శారు. అనంతరం చర్లపల్లి గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ కుమారుడు కార్తీక్గౌడ్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం రామకిష్టాపురం గ్రామాని కి చెందిన మృతుడు కావలి వెంకటయ్య కుటుంబానికి రైతుబీమా చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. దక్షత, చతురత, చైతన్యవంతమైన, జ్ఞానవంతమైన నాయకత్వం కేసీఆర్ రూపంలో దొరికిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అధిక జీతాలు ఇస్తున్నామన్నారు. నూ తన జోనల్ విధానాన్ని ఏర్పాటు చేసి వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించారన్నారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే 60 నుంచి 70 వేల ఖాళీలతో నోటిఫికేషన్ రానున్నదని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు, తెలంగాణకు తేడా గమనించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు.
అనంతరం కనిమెట్టలో రైతువేదిక ఎదుట ఉన్న 25 అడుగుల రైతు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతువేదిక ముందు ధాన్యాలతో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రం ఆకట్టుకున్నది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ మౌనిక, మున్సిపల్ చైర్పర్సన్ సుకేసిని, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, డీఎంహెచ్వో చందూనాయక్, డీఏవో సుధాకర్ రెడ్డి, సర్పంచులు రాణి, రాధ, కౌన్సిలర్లు రాములుయాదవ్, రామ్మోహన్రెడ్డి, పద్మ, సంధ్య, తిరుపతయ్య, ఖాజామైనోద్దీన్, కో ఆప్షన్ సభ్యులు మిషేక్, వహీద్, శ్రీను, రై తుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, నాయకులు బాబురెడ్డి, నిర్మలారెడ్డి, ప్రసన్న లక్ష్మి, భీంరెడ్డి, శ్రీను, పరమేశ్, అల్లాభాషా, రాములుయాదవ్, కోటేశ్వర్రెడ్డి, వినోద్సాగర్, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.