నర్వ, ఏప్రిల్ 26: మండలంలోని 19 గ్రామపంచాయతీల్లో 45 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఆర్డీవో కాళిందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొనసాగుతున్న కొవిడ్ టీకా పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఐకేపీ సిబ్బంది, మహిళా గ్రూపుల్లో 45 సంవత్సరాల వారిని, ఉపాధి హామీ సిబ్బంది తమ పరిధిలోని 45 సంవత్సరాలు నిండిన వారిని గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో 45 ఏండ్లు నిండినవారిని గుర్తించి ఈనెలాఖరు వరకు కొవిడ్ టీకా ఇప్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్కుమార్, డాక్టర్ ఫాతిమా, పంచాయతీరాజ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
కొవిడ్ టెస్ట్ కోసం రూ.500 డిపాజిట్.. మెడికల్ ఆఫీసర్ సస్పెండ్