వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్న సహకార చక్కెర కార్మాగారాలు, రైతు సహకార సంఘాల పనితీరును వారు పరిశీలిస్తారు. కాగా, రైతుల బస్సు యాత్రను జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.