వనపర్తి : స్కూల్ బస్సు బోల్తా పడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన వనపర్తి
మండలం అంజనగిరి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడిండి.
బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.