ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి ఎలాంటి నీటి విడుదల లేకున్న ప్పటికీ ఎగువ ప్రాతంలో కురుస్తున్న వర్షాలకు వరద కొనసాగుతుంది. 44వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరుతుండగా ప్రాజక్టు నుంచి అవుట్ ఫ్లో 40,388 క్యూసెక్కులు కొనసాగుతుంది.
భీమా-1కు 650 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 975, కుడి కాలువకు 672, సమాంతర కాలు వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 37,100 క్యూసెక్కులు విద్యుదుత్పత్తికి విడు దల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా 8.969 టీఎంసీలు నమోదయ్యింది.
నీటి వృథా లేకుండా కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఎగువ నుంచి వస్తున్న వరద లభ్యతను బట్టి ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని చుక్కబొట్టు కూడా వృథా కాకుండా విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నామని జెన్కో డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. గురువారం ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ జూరాలకు వస్తున్న ఇన్ఫ్లోను బట్టి ఇప్పటి వరకు సంతృప్తికరంగానే విద్యుదుత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎగువ జూరాలలో వినియోగంలో లేని 5వ యూనిట్ను మరో వారం రోజుల్లో వినియోగంలోకి తీసుకు రాగలమన్నారు. ఇప్పటికే మరమ్మత్తు పనులు నిర్వహిస్తు న్నట్లు, వారం రోజుల్లో సన్నాహక పరీక్షలు పూర్తిచేసుకొని అందుబాటులోకి తేగలమని చెప్పారు. గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చి ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ వరద ఉధృత్తి అధికంగా రావడం వల్ల అవాంతరాలు వచ్చాయన్నారు.
ఇప్పటివరకు లక్ష్యానికి అర్ధశాతం ఉత్పత్తిని జూరాల ప్రాజక్టులు పూర్తి చేశాయన్నారు. స్థిరంగా వరద కొనసాగితేనే విద్యుత్ ప్రాజక్టులు సహితం స్థిరంగా ఉత్పత్తిని చేయగలవన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజినీర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తపై సూచనలు చేశారు. ఎగువ జూరాలలో 200 మిలియన్ యూనిట్ల మార్కు చేరడం పట్ల ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు జయరాం, వర్మ, శ్రీధర్, డీఈలు పవన్ కుమార్, విన్నూత్, క్రిష్ణకిషోర్, బాల్రెడ్డి, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.