ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీస్తోందని కన్న కూతురిని పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో జరిగింది. పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ఒక కూతురు. ఆమె పెబ్బేరులో 10వ తరగతి చదువుతోంది. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ఆమె ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందని రాజశేఖర్కు తెలిసింది.
మంగళవారం ఉదయం ఇదే విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఊర్లో కుటుంబ పరువు తీస్తున్నావంటూ కూతురిపై రాజశేఖర్ మండిపడ్డాడు. క్షణికావేశంలో చేతికి దొరికిన పదునైన ఆయుధంతో కూతురి గొంతు కోసి చంపేశాడు. విషయం తెలిసుకున్న పోలీసులు హుటాముటిన ఘటనా స్థలానికి చేరుకొని రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన డీఎస్పీ ఆనంద్ రెడ్డి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.