వనపర్తి : జిల్లా విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి జయంత్(5) సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తకోట మండలం కానాయపల్లిలో సోమవార చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన దారమోని ఎనిగెల శివ, శిరీష దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. చిన్న కుమారుడు జయంత్(5) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. గమనించిన తల్లి బయటకు తీసే లోపే జయంత్ మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.