బెయర్ కంపెనీ జిల్లాలో రెండు సంఘాలకు ఉచితంగా సరఫరా
నారాయణపేట టౌన్, జూలై 5 : జిల్లాలో మహిళల సా ధికారత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు మంగళవారం ఉచితంగా దాల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెయర్ కంపెనీ వారు జిల్లాలోని పేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన కాళేశ్వరి మహిళా సంఘం, దామరగిద్ద మండలం ఉడ్మల్గిద్ద గ్రామానికి చెందిన వెంకటేశ్వర మహి ళా సంఘం వారికి సుమారు రూ.6లక్షల విలువ గల దాల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. యంత్రాలను అనువైన స్థలంలో ఉంచి జాగ్రత్త గా ఉపయోగించుకోవాలన్నారు. యంత్రాలను వినియోగించే విధానాలపై బెయర్ ప్రతినిధులు శిక్షణ ఇస్తారన్నారు. మహిళలు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడంతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆమె సూచించా రు. మిల్లెట్లను ప్రాసెసింగ్ చేసి అరుణ్య బ్రాండ్తో విక్రయా లు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అప్రో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సన్నీ, బెయర్ ప్రతినిధి రా మకృష్ణుడు, జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, డీఆర్డీవో గో పాల్నాయక్, డీపీఎం రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా అనంతర పరిస్థితుల నే పథ్యంలో సంప్రదాయక విధానాలకు స్వస్తి చెప్పి ఉపాధ్యాయులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో సోషల్ వెంచర్ పార్టనర్స్ హైదరాబా ద్ చాప్టర్, అలోకిత్ ఫౌండేషన్ వారి సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన వర్క్షాప్ను మంగళవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా ప్రమాణా లు సాధించడంలో ఉపాధ్యాయులు వినూత్నంగా, సృజనాత్మకంగా నూతన సహస్రాబ్ధి మెళకువలను వినియోగిస్తూ కృషి చేయాలన్నారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిం చి విద్యాసామర్థ్యాలను సాధించేందుకుగానూ వినూత్న ప ద్ధతుల్లో ఆకర్షణీయంగా బోధించాలన్నారు. ఎస్వీపీ వారి సౌజన్యంతో వైద్య, మహిళా శిశు సంక్షేమశాఖల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం విద్యాశాఖలో భాగస్వాములై వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టి జిల్లాలో మరో ముందడుగు వేయడం జరిగిందన్నారు. అంకురం ప్రాజెక్టు తో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీలలో ప్రావీణ్యం సాధించేందుకు సోషల్ వెంచర్ పార్టనర్స్ హైదరాబాద్ చాప్టర్, అలోకిత్ ఫౌండేషన్ వారి సంయుక్త సౌజన్యంతో విద్యా ప్రమాణాలు మెరుగపర్చేందుకు అంకురం ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా నాలుగు స్కూల్ కాంప్లెక్స్ల్లో 50 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్క్షాప్ నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్గా ఉంటూ మానసిక, శారీరక వికాసానికి తమవం తు ప్రోద్బలం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, ఎస్వీపీ సంస్థ ప్రతినిధి సునీత, లోకిత్ సంస్థ వ్యవస్థాపకులు సాయిప్రమోద్, జోబోయ్, అమ్జద్, ఎలిజబెత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.