వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని శంకర్ సముద్రం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి సుమెర్ (15) సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
గురువారం మధ్యాహ్నం నలుగురు బాలురు కలిసి శంకర్ సముద్రంలో ఈతకు వెళ్లారు. సుమెర్కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడని బంధువులు తెలిపారు. సుమెర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.