వనపర్తి జిల్లాలో 10 లక్షల గొర్రెలు, 80 వేల మేకలు
సాగునీరు రావడంతో పెరిగిన జీవాలు
త్వరలోనే రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి రూరల్, జూన్ 8 : దేశంలోనే అత్యధికంగా జీవాల పెంపు మన రాష్ట్రంలోనే ఉన్నదని, అందులో వనపర్తి జిల్లా ముందంజలో నిలిచిందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో పశువైద్యశాఖ అధ్వర్యంలో జీవాలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాదికిగానూ జిల్లాలోని 10.50 లక్షల గొర్రెలకు, 80 వేల మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాపుతున్నట్లు తెలిపారు. జి ల్లా వ్యాప్తంగా మొత్తం 28 బృందాలతో నట్టల నివార ణ మందును పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ప్రభు త్వం రూ.22.19 లక్షల విలువైన 4 రకాల మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మనుషులకే కాదు జీవాలకు సైతం అంబులెన్సులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే అన్నారు. రాష్ట్రంలో సాగునీటి రాకతో ఎక్కడ చూసినా పచ్చగా మారిందని, గడ్డికి కొరత లేదన్నారు. దీంతో యాదవులు సూదర ప్రాంతాలకు వెళ్లి జీవాలను మేపే పరిస్థితి లేదన్నారు. జిల్లా కేంద్రం శివారులో జీవాల ఉత్పత్తి కేంద్రానికి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించినట్లు తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ రీసె ర్చ్ సెంటర్ జీవాల పునరుత్పత్తికి దోహద పడుతుందని చెప్పారు. గొర్రెల కాపరులు జీవాల పెంపునకు షెడ్ల ని ర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రై తులు వ్యవసాయంతోపాటు కోళ్లు, గొర్రెల, పశువుల పోషణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతకుముందు గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు కురుమూర్తి యాదవ్, చంద్రయ్య యాద వ్ మంత్రి నిరంజన్రెడ్డికి గొర్రె పిల్లను అందజేసి తలకు కండువా కట్టి సన్మానించారు.
బీటీ రోడ్డుకు శంకుస్థాపన..
రాజపేట గ్రామం నుంచి తండాకు వెళ్లేందుకు రూ. కోటీ 30 లక్షలతో నిర్మాణం చేపట్టిన బీటీ పనులను మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రా మంలో ఇక్రిశాట్, బైఫ్ సంస్థల అధ్వర్యంలో గిరిజన మహిళలకు 30 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ తండాకు సమీపంలో జిల్లా స మీకృత కార్యాలయం ఏర్పాటుతో అభివృద్ధికి ఎంతగా నో దోహదం కానున్నదన్నారు. రాబోయే రోజుల్లో తం డా వనపర్తి మున్సిపాలిటీలో కలువడం ఖాయమన్నా రు. తండాలోని ప్రభుత్వ పాఠశాలకు నూతన భవన ని ర్మాణానికి, బానేగాని తండాకు బీటీ మంజూరుకు కృషి చేస్తానన్నారు. అనంతరం తండాలో గిరిజనుల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి, జయరాములు నాయక్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్య యాదవ్, పీఏసీసీఎస్ నాగవరం చైర్మన్ మధుసూదన్రెడ్డి, పశువైద్యారోగ్య శాఖ జిల్లా అ ధికారి వెంకటేశ్వర్రెడ్డి, మండల పశువైద్యాధికారి ఆంజనేయులు, లోకారెడ్డి, రాఘవేంద్రారెడ్డి, దశరథం, నా యకులు రఘువర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, వేమారెడ్డి, దుల య్య యాదవ్, తిరుపతయ్య, నాగేంద్రం యాదవ్, బా లస్వామి, శంకర్ నాయక్, జాహంగీర్, బుచ్యానాయక్, లచ్చానాయక్, ముత్యాలు, నరేశ్నాయక్ పాల్గొన్నారు.