వనపర్తి, జూన్ 10 : ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను పునః వ్యవస్థీకరించి, ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి ప థంలో పయనిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలను కలెక్టర్తో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలుశాఖల అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరువు కాటకాలతో ఉన్న జిల్లా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానలను ఏ ర్పాటు చేసి ఉత్తమ సేవలను అందిస్తున్నామని తెలిపా రు.
ప్రస్తుతం డిజిటలైజేషన్ విధానం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు వివరించా రు. రాష్ట్రం ఏర్పడక ముందు 185 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రసుత్తం జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 255 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.310. 99కోట్ల నిధులు విడుదల కాగా రూ.238.61కోట్లను పలు పనుల కోసం వినియోగించామన్నారు. రూ. 17కోట్లతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చే యగా.. 98 ఆరోగ్య ఉపకేంద్రాలను వెల్నెస్ సెంటర్లు గా మార్చి 59మంది ఎంఎల్హెచ్పీ డాక్టర్లను నియమించామన్నారు. రూ.53లక్షలతో క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేసి.. మూడు సెంట్రల్ నర్సరీలు, 25 ప ట్టణ ప్రకృతి వనాలు, మీడియన్ ప్లాంటేషన్ 6 కిలోమీటర్ల మల్టీలేయ ర్ అవెన్యూ ప్లాంటేషన్, ఇతర పనులకు రూ.3కోట్ల 60లక్షలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు.
అన్ని రంగాల్లో జిల్లా ముందంజ
మున్సిపాలిటీలు, వైద్య కళాశాలలు, హెల్త్ సెంటర్లు, రోడ్ల విస్తరణలో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ధరణి ఏర్పాటు తో 65వేల భూ సంబంధిత రిజిస్ట్రేషన్లు పూర్తయ్యా యని, జిల్లా అభివృద్ధి సాధించినందుకు మంత్రి ని రంజన్రెడ్డికి, జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, జిల్లా అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.