గద్వాల : అక్టోబర్ 11 : జోగులాంబ గద్వాల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. 2023 అక్టోబర్ 4వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితా ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ వరకు ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాను రూపొందించారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటర్ నమోదు చేసుకున్నారు.అధికారులు ప్రజలకు ఓటర్ నమోదుపై అవగాహాన కల్పించడంతో మహిళలు ఎక్కువగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.దేశ భవిష్యత్ను మార్చే శక్తి కేవలం ఓటర్కు మాత్రమే ఉంది.ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు గా భావించి ప్రతి ఒక్కరు నమోదు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఓటర్లు అధికంగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.2018తో పోల్చితే 2023 వరకు అదనంగా 46,007 మంది ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు.
2018లో జిల్లాలో 4,43,938 మంది ఓటర్లు ఉండగా, 2023 ఓటరు తుది జాబితా విడుదల చేసిన నాటికి జిల్లాలో 4,89,945 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో గద్వాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,53,889 మంది ఉండగా, అందులో పురుషులు 1,24,763 మంది ఓటర్లు, మహిళలు 1,29,096 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 4,333 మంది అధికంగా ఉన్నారు అలంపూర్లో మొత్తం ఓటర్లు 2,36,076 మంది ఉండగా, అందులో పురుషులు 1,16,989 మంది ఓటర్లు, మహిళలు 1,19,080 మంది ఉన్నారు.
ఇందులో పురుషుల కంటే మహిళలు 2,091 మంది అధికంగా ఉన్నారు. జిల్లా మొత్తంగా పురుషులు 2,41,752 మంది ఉండగా, మహిళలు 2,48,176 మంది ఉన్నారు. ఇతరులు 17మంది ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలు 6,452 మంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 593 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కులం, మతం, వర్గ, లింగ బేధాలు లేకుండా ఓటు హక్కు కల్పించడంతో యువత తమ ఓటు నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. 18 నుంచి 19ఏండ్లలోపు జిల్లాలో ఓటు హక్కు నమోదు చేసుకున్న యువత 21,711 మంది ఉన్నారు.
జిల్లాలో యువత, మహిళా ఓటర్ల ఓట్లు అభ్యర్థులకు ప్రధానం కానున్నాయి. దేశ భవిష్యత్లో ప్రధాన పాత్ర పోషించే యువత ఓట్లు జోగులాంబ గద్వాల జిల్లాలో 21,711 ఉన్నాయి. అలాగే మహిళల ఓట్లు 2,48,175 ఉన్నాయి. మొత్తం 2,69,886 ఓట్లు మహిళలు, యువతవే ఉన్నాయి. మిగతా ఓట్లు 2,20,059 ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో యువత, మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువత, మహిళలతో సమావేశమై ఓట్లు అభ్యర్థించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2018 ఎన్నికలప్పుడు ఉన్న ఓట్లకు ప్రస్తుతం ప్రకటించిన ఓట్లకు అదనంగా 46,007 ఓట్లు పెరిగాయి.
గతంలో చెరువుకట్టపైకి వెళ్లాలంటేనే భయంగా ఉండేది. కేవలం కట్టపై నడిచేందుకు మాత్రమే బాట ఉండేది. నిండుగా కంపచెట్లు ఉండడంతో పొలాలకు వెళ్లేందుకు కొంతమంది కలిస్తేనే వెళ్లే పరిస్థితులు ఉండేవి. నేడు చెరువు రూపురేఖలే మారిపోయాయి. కట్టపోంటి పెద్ద రోడ్డు, లైట్లు, కుర్చీలు వేసిన్రు. నిరంజన్రెడ్డి సార్ వచ్చినంకనే ఇంత బాగైంది. ఇంతకుముందు నాయకులు ఇవన్నీ పట్టించుకొలే.