జడ్చర్లటౌన్, నవంబర్ 1: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కారుగుర్తుకు ఓటేసి మరోసారి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికీ ప్రచారంతోపాటు వ్యాపార సముదాయాల వద్దకెళ్లి వ్యాపారులను కలసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేపట్టిన అభివృద్ధ్ది పనులను గురించి వివరించారు. బీఆర్ఎస్ శ్రేణుల ఇంటింటి ప్రచారానికి అపూర్వస్పందన కనిపించింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 1: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని జెడ్పీటీసీ జర్పుల కల్యాణి అన్నారు. మండల కేంద్రంలో పలు వార్డుల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మండలంలోని హేమాజీపూర్, గాంధీపాలెం, లింగారంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, వైస్ ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్మిక విభాగం మండలాధ్యక్షుడు గుడిసెల యాదయ్య, యూత్ వింగ్ మండల ప్రధాన కార్యదర్శి సూరిముదిరాజ్, గ్రామాధ్యక్షుడు రవికుమార్, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహలు, గణేశ్గౌడ్, సుధాకర్, కృష్ణయ్య, యాదయ్య, శివ, లింగం, ఆదిత్య, మహిళలు తదితరులు ఉన్నారు.
రాజాపూర్, నవంబర్ 1: పేదలకు ఏకష్టం వచ్చినా కడుపున పెట్టి చూసుకునేది కేవలం బీఆర్ఎస్ ప్రభత్వమేనని జెడ్పీటీసీ మోహన్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డిగూడలో బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులతో కలసి ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, ఏఎంసీ డైరెక్టర్ తిరుపతయ్య, వెంకట్నాయక్, శ్రీనివాస్, శేఖర్, సత్యయ్య, రమేశ్నాయక్, మహేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పార్టీని గెలుపిస్తాయని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్ అన్నారు. బుధవారం మండలంలోని మున్ననూర్, రాణిపేట, వల్లబురావుపల్లి, ఈదులబావితండా, బోయిన్పల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నిరంజన్, భద్రయ్య, ప్రతాప్రెడ్డి, బుచ్చయ్య, భాస్కర్, అంబచారి, జగదీశ్, బంగారు, భీమ్రాజు, నవీనాచారి, బుచ్చయ్య, వీరారెడ్డి, వెంకటయ్య, రాము, నర్సింహ, లక్ష్మణ్పవర్, విజయ్నాయక్ తదితరులు ఉన్నారు.
నవాబ్పేట, నవంబర్1: మండల కేంద్రంతోపాటు యన్మన్గండ్ల, దేపల్లి, కాకర్జాల, కారుకొండలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు గోపాల్గౌడ్, జయమ్మ, లత, అలివేలు, లక్ష్మమ్మ, యూత్వింగ్ అధ్యక్షుడు శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, అక్టోబర్ 1: మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గంగాపూర్లో మార్కెట్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, తంగెళ్లపల్లిలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ఖాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.