వెల్దండ: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పర్చాలన్నాదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధ వారం వెల్దండ మండలంలోని శంకర్కొండ తాండ, గన్యబాగుతాండలో రూ.16లక్షల జీపీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, గన్య బాగుతాండ నుంచి కొత్తకుంటతాండ వరకు నిర్మించే మట్టి రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముం దుకు సాగుతున్నారని అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.
కార్యక్రమంలోఎంపీపీ విజయ, జడ్పీటీసీ విజితారెడ్డి, వైస్ ఎంపీపీ శాంతి, సర్పంచ్లు భూపతి రెడ్డి, కోమటి, ఎంపీటీసీ మోతీలాల్, నారాయణ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు తిర్మల్రావు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రవిగౌడ్, యాదగి రి, విజేందర్,రవి, ఘంస్యా, పుల్యా కొత్తకుంటతాండ సర్పంచ్ శోభచందు, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.