బాలానగర్, నవంబర్ 25 : మండలకేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మండలకేంద్రా నికి నిత్యం వేల మంది ప్రజలు, వాహనదారులు పలు ప నుల నిమిత్తం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. షాపులకు వెళ్లే ప్రజలు వా హనాలను రోడ్డుపైనే నిలపడంతో ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుం డా పోలీస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తగు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డెక్కుతున్న వ్యాపారాలు..
ప్రధానమైన రోడ్లను అక్రమించి వ్యాపారం చేస్తున్నారు. పోటీపడి వ్యాపారాన్ని రోడ్డుపైకి తెచ్చారు. దీంతో అక్కడ నిలపాల్సిన వాహనాలను రోడ్డు మధ్యలో నిలపాల్సి వస్తు న్నది. వారాంతపు సంత జరుగే రోజూ చాలా ట్రాఫిక్ ఎక్కు వ ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర భుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఉండడంతో నిత్యం ప్రజలు, విద్యార్థులు మండలకేంద్రానికి వ స్తుండడంతో రోడ్డుపై వెళ్లే వాహనాలను రో డ్లకు ఇరువైపులా పార్కింగ్ చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ ప్పటికైనా పోలీసులు స్పందించి జాతీయ ర హదారిపై ఒక కానిస్టేబుల్నూ నియమించాలని మండల ప్రజలు, వాహనదారులు కో రుతున్నారు.
చర్యలు తీసుకోని అధికారులు..
మండలంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిచాలని ప్రజలు కోరుతున్నారు. పెట్రోలిం గ్, ట్రాఫిక్ పోలీసులు వాహనాలు సైరన్ వే సుకుంటూ అనేక సార్లు అటు ఇటూగా రౌం డ్స్ వేయడమే తప్ప ట్రాఫిక్ను క్లియర్ చే యడంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ను ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు మ ధ్యాహ్నం, సాయంత్రం పలు సెంటర్లలో కాపు కాస్తూ వా హనదారులకు మాత్రం జరిమానాలు వేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైనే వ్యాపారాలు చేస్తున్న కనీసం వారిని హెచ్చరించిన దాఖలాలు కనిపించడం లేద ని అంటున్నారు. పలు కూడళ్లల్లో నిర్వహించే కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా తమకు ఏమీ పట్టనట్టు ఫోన్లు చూసుకోవడం, రాంగ్ రూట్, త్రి బుల్ రైడింగ్ చేసే వారి వాహనాల ఫొటోలు తీయడానికే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
సమస్య పరిష్కరించాలి
మండలంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రధాన సెంటర్లలో రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నది. నిబంధనలు పాటించని వ్యాపారస్తులు, వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకొని ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలి.
-నితీశ్, యువకుడు
చర్యలు తీసుకుంటున్నాం
మండలకేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుపై వాహనాలు నిలిపే వాహనదారులపై, రో డ్డును అక్రమించి వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకొని జరి మానాలు వేస్తున్నాం. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు వేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం.