పెద్దమందడి, అక్టోబర్ 25: మండలంలోని వీరాయిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 2.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 1.7 కిలోమీటర్ ఓపెన్ డ్రైనేజీ, 180 మీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇటీవల నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వా రా గ్రామానికి ట్రాక్టర్ మంజురైంది. గ్రామ పంచాయతీకి నలుగురు సిబ్బంది ఉన్నారు. గతంలో గ్రామంలో సీసీ రో డ్లు లేక రోడ్లన్నీ బురదమయంగా ఉండేవి. వర్షాకాలం వస్తే రోడ్లపై నడవడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తు తం గ్రామంలో సీసీ రోడ్లు , డ్రైనేజీలు నిర్మించుకోవడం ద్వారా కొత్తకళ వచ్చింది. రోగానబారిన పడే వారి సంఖ్య తగ్గింది. గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామ సమీపంలో ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతివనంలో రెండువేల మొక్కలు పెంచుతున్నారు. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామంలో 2022-23 సంవత్సరంలో 5వేల మొక్కలు పెంచారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ భవ నం 1, డంపింగ్యార్డు, శ్మశానవాటిక, ఆరోగ్య కేంద్రం, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, మహిళ సమాఖ్య భవనాలను కొత్తగా నిర్మించారు.
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్దమందడి మండలానికి కేఎల్ఐ నీటిని తీసుకురావడంతో బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీరు లేక గతంలో బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన వా రంతా నేడు స్థానికంగా ఉంటూ పనులు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా గ్రామంలోని 294మంది రైతులకు అందుతోంది. అలాగే రైతుబంధు పథకంలో 428 మంది రైతులకు రూ.3,1,30,894 లు ప్రతి ఏడాది రెండు పంటలకు పెట్టుబడి సాయం అందుతోంది. గ్రామంలో దురదృష్టవశాత్తు మరణించిన ఏడుగురు రైతు కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం అందజేసింది. మిషన్ కాకతీయ ద్వారా గ్రామ ఊరకుంట, రేవులకుంట, కోమటికుంటను పునరుద్ధరించారు. దీంతో భూగర్భజలాలు పెరిగి ఎత్తు ప్రదేశాల్లో ఉన్న బోరుబావుల నుంచి సైతం పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి.గ్రామంలో 32 మందికి గొర్రెలను యూనిట్ల వారిగా మొదటి విడతలో పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు. వాటిద్వారా యాదవులు జీవనోపాధి పొందుతున్నారు. అలాగే గ్రామంలో కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు వీరాయపల్లి గ్రామంలో మొత్తం 46 మంది లబ్ధ్దిదారులకు సహాయం అందింది.
గ్రామంలో రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమంలో 762 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 148 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించారు. మరో 90 మందికి ఆర్డర్ చేసి నేరుగా ఇండ్ల వద్దకే కళ్లద్దాలు అందజేశారు. అదేవిధంగా ఆరుగురు గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నారు. అలాగే గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో రూ.8.97 కోట్లతో గిడ్డంగుల సంస్థ ద్వారా గ్రామంలో 8,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించి ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా ప్రాంతంలో అత్యధికంగా వేరుశనగ పంటలను సాగుచేస్తుండడంతో వీరాయపల్లి గ్రామ సమీపంలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి నిరంజన్రెడ్డి ప్రభుత్వ స్థలాలను ఏర్పాటు చేసి, కేంద్రాన్ని మంజూరు చేయించారు. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించినట్లు అధికారులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల బలోపేతానికి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో పాఠశాలల్లో మౌలిక వసతులు, నూతన తరగతి గదులు, ప్రహరీ, బెంచీలు తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు సంఖ్య పెరుగుతుంది. అందులో భాగంగానే మండలంలోని వీరాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపిక చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
గతంలో ప్రాథమికోన్నత పాఠశాల భవనం శిథిలావస్థ స్థితిలో ఉండేది. ప్రస్తుతం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మరమ్మతులు చేశారు. భవనానికి రంగులు వేయించారు. విద్యార్థుల కోసం ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. కార్పొరేట్ పాఠశాల మాదిరిగా తయారైంది. దీంతో గ్రామస్తులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాం.. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అడగకముందే ఏర్పాటు చేస్తోంది. సీఎం కేసీఆర్ మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల అదృష్టం. వనపర్తి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి నిరంజన్రెడ్డి అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాడు. ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టం. సీఎం కేసీఆర్కు, మంత్రి నిరంజన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.