అచ్చంపేట, డిసెంబర్ 11: పేదలకు సాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణలో నల్లమల అడవుల సమీపంలోని నాగర్కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హైస్కూల్లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్కు మొత్తం రూ.25వేల ఆర్థికసాయం, అందజేశారు. అలాగే వారికి వైద్య సేవలు అందేలా gor sevaతో సమన్వయం, మన్ననురు రేంజ్కు చెందిన భౌరాపూర్ గ్రామంలో చెంచు, గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుం దన్నారు.
ఇక్కడి గిరిజనులకు సేవా కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అద్భుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకా సాయం కావాలన్నా ఆటా తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా కార్యదర్శి రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీశ్రెడ్డి,18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నర్సింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్లపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్రెడ్డి పాల్గొన్నారు.