వనపర్తి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వనాలపర్తిగా పే రుగాంచిన వనపర్తి జిల్లాలో మరింత పచ్చదనం పరుచుకున్నది. పల్లెలు, పట్టణాలకు హరితశోభ సంతరించుకున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 255 గ్రామ పంచాయతీలు, నా లుగు మున్సిపాలిటీల్లో పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 2021-22 ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈ కార్యక్రమా న్ని వంద శాతం పూర్తి చేశారు. అమరచింత మండలంలోని 14 జీపీలు, ఆత్మకూరులో 13, చిన్నంబావిలో 17, ఖిల్లాఘణపురంలో 27, గోపాల్పేటలో 15, కొత్తకోటలో 22, మదనాపురంలో 17, పాన్గల్లో 28, పెబ్బేరులో 20, పెద్దమందడిలో 22, రేవల్లిలో 12, శ్రీరంగాపూర్లో 8, వీపనగండ్లలో 14, వనపర్తిలోని 26 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏ ర్పాటు చేశారు.
4.78 లక్షల మొక్కలను కేవలం జీపీ పరిధిలోనే నాటారు. ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.3.67 కోట్లు ఖ ర్చు చేసింది. గ్రామాలకు చేరువలో వీటిని ఏర్పాటు చేయడంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతున్నది. ఉదయం, సా యంత్రం వేళల్లో సేదతీరుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన బృహత్ ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. వీటిని పది ఎకరాలు, ఐదు ఎకరాలు అని రెండు రకాలుగా విభజించి ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు 98.5 శాతం పూర్తికాగా, పది ఎకరాల్లోని వనాలు వందశాతం లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నాయి.
మండలానికి ఒకటి చొప్పున రూ.40 లక్షలతో అభివృద్ధి పరిచారు. 20 21-22కు సంబంధించి 5.39 లక్షల మొక్కలు నాటగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.33 ల క్షల మొక్కలు నాటారు. బృహత్ ప్రకృతి వనాల కింద జిల్లాలో 7,71,438 మొక్కలను నాటారు. దీంతో ఈ వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలను ఎకరా విస్తీర్ణం లో రూ.3 లక్షలతో ఏర్పాటు చేశా రు. నాలుగు నుంచి ఐదు వేల పండ్లు, సుందరీకరణ, నీడని చ్చే మొక్కలను మూడు వరుసల్లో పెంచుతున్నారు. వనాల్లో ప్రజలు న డిచేందుకు సుందరంగా దారి ఏర్పాటు చేశారు. వేప, రాగి, మర్రి, కానుగ, బాదం, గన్నేరు, మందారం, ఉసిరి, నేరేడు, సీమచిం త, కరివేపాకు వంటి చెట్లను పెంచుతున్నారు.