మహబూబ్నగర్: కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి డోస్ వాక్సిన్ వేయించుకోని వాళ్లు,రెండో డోస్ వేయించుకోని వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ప్రతివార్డులో ప్రజలు, విద్యార్థులకు అధికారులు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఫీక్, ఎన్సీసీ ఎఎన్వో రాజశేఖర్రెడ్డి, మున్సిపల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.