ఊట్కూర్, మార్చి 26: ప్రభుత్వ బడులను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని నిడుగుర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను శనివారం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈక్రమంలోనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు నియోజకవర్గంలోనే ఉన్నత చదువులు చదువుకునేందుకు మక్తల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హెచ్ఎం ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, సర్పంచ్ యశోదమ్మ, ఎంపీటీసీ రాఘవరెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మన ఊరు – మన బడితో మౌలిక వసతులు
మక్తల్ టౌన్, మార్చి 26: సీఎం కేసీఆర్ మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. ఆదివారం మక్తల్ మండలంలోని కర్ని ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తరగతి గదులు లేక, చెట్ల కిందనే విద్యాభ్యాసం కొనసాగేదని, వలస పాలకుల చేతుల్లో ఆగమైన విద్యారంగాన్ని అభివృద్ధి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మండలంలో 28 పాఠశాలలు మనఊరు – మనబడి కార్యక్రమంలో అభివృద్ది చెందాయని, మిగతా పాఠశాలలను సైతం త్వరలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్ని ఇన్చార్జ్జి సర్పంచ్ సద్దాం, మాజీ ఎంపీటీసీ దత్తు, మాజీ సర్పంచ్ రాఘవేందర్తోపాటు గ్రామస్తులు. ఉన్నారు.