మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని మూలలకు అద్భుతమైన రహదారి వ్యవస్థను కల్పించాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా అనేక రాష్ట్ర రహదారులను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయ రహదారులుగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడం వల్లే ఈ జాతీయ రహదారి సాధ్యమైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సుమారు 145 కి.మీ. కొత్త జాతీయ రహదారికి 167ఎన్ నెంబర్ను కేటాయిస్తూ కేంద్ర ఉపరితల రవాణ శాఖ గెజిట్ విడుదల చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి