మక్తల్ : ఒండ్రుమట్టి తరలించే టిప్పర్ డ్రైవర్ అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నారాయణపేట జిల్లా ( Narayanapet Mandal ) మక్తల్ మండలంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి తరలింపు పెద్ద ఎత్తున జరుగుతోంది. మట్టిని తరలించే టిప్పర్ డ్రైవర్లు( Tipper Drivers ) అత్యంత నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
మక్తల్ పెద్ద చెరువులో శనివారం ఒండ్రుమట్టిని తరలిస్తూ పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద ద్విచక్రవాహనదాడిని బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేరు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.