వనపర్తి టౌన్, ఫిబ్రవరి 21 : ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజారుకు చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం పాఠశాలకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి రా కపోవడంతో తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి ఆరాతీశారు. పాఠశాలకు రాలేదని సిబ్బంది చెప్పగా.. చుటుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిం పు చర్యలు చేపట్టారు.
గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్చౌక్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. కొత్త బస్టాండ్ వద్ద కర్నూల్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. మన్యంకొండ కూతురు వై. పావని మెరూన్ కలర్ దుస్తులు ధరించి తెల్లని క్యా రీబ్యాగ్ పట్టుకున్నదని, నాగేశ్వర్ కూతురు తోకల మౌనిక స్కై బ్లూ డ్రెస్ ధరంచి స్కూల్ బ్యాగుతో వెళ్లిందని.. ఇద్దరూ 12 ఏండ్లలోపు బాలికలేనని, ఆచూకీ తె లిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.