కొత్తకోట, జనవరి 26 : మండలంలోని ముమ్మళ్లపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన చందుకుమార్(19) బోయ వెంకటేశ్తో కలిసి బైక్పై కొత్తకోటకు జెండా కాగితాలు తీసుకురావడానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ వీరి బైక్ను ఢీకొట్టింది.
దీంతో చందుకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108లో వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.