నాగర్కర్నూల్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్కు తొలిసారిగా ప్రదాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్తో పాటుగా మహబూబ్నగర్, సూర్యాపేట పార్లమెంట్ స్థానాల నుంచి కూడా అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ నిర్వహిస్తున్నారు. వెలమ ఫంక్షన్హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థ లంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్షలాదిగా జన సమీకరణ చేపట్టనుండడంతో అందుకనుగుణంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్కర్నూల్కు చేరుకొని 11:45 నుంచి 12:45 గంటల వరకు బహిరంగ సభలో పీఎం ప్రసంగించనున్నారు. అనంతరం ఒంటిగంటకు కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్నారు.
నాగర్కర్నూల్, మార్చి 15: జిల్లా కేం ద్రంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బ హిరంగ సభ సందర్భంగా నాగర్కర్నూల్ మీ దుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రధాన మంత్రి సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, కార్యకర్తల వాహనాల పార్కింగ్, వివిధ ప్రాంతాలకు వెళ్లే రూట్ల గురించి వివరించారు. అచ్చంపేట, కల్వకుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను కొల్లాపూ ర్ చౌరస్తా వద్ద గల గాయత్రీ దవాఖాన వెనుకభాగంలో, సబ్స్టేషన్ వద్ద ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు.
అదేవిధంగా బిజినేపల్లి నుంచి తాడూరు మీదుగా వచ్చే వాహనాలు నెల్లికొం డ గేటు వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డులో పార్కింగ్ చేయాలని, కొల్లాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు సఖి సెంటర్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మధ్య ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. అలాగే భూత్పూర్, బిజినేపల్లి నుంచి అచ్చంపేట, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ముందు నుంచి ట్యాంక్బండ్ మీదుగా తాడూరు, మంతటి చౌరస్తా నుంచి వెళ్లాలని, భూత్పూర్, బిజినేపల్లి నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలు ట్యాంక్బండ్, తాడూరు మీదుగా వెళ్లాలన్నారు.
భూత్పూర్, బిజినేపల్లి నుంచి నాగర్కర్నూల్ మీదుగా కొల్లాపూర్ వెళ్లే వాహనదారులు నాగర్కర్నూల్ పట్టణం నుంచి నాగనూలు చౌరస్తా, వనపట్ల గేటు నుంచి వెళ్లాలన్నారు. కొల్లాపూర్ నుంచి నాగర్కర్నూల్ మీదుగా బిజినేపల్లి, భూత్పూర్ వెళ్లే వాహనదారులు వనపట్ల గేటు నుంచి నాగనూలు, నాగర్కర్నూల్ బస్టాండ్ మీదుగా వెళ్ళాలన్నారు. అచ్చంపేట నుంచి భూత్పూర్, మహబూబ్నగర్కు వెళ్లాలంటే మంతటి నుంచి తాడూరు, ఉయ్యాలవాడ, బిజినేపల్లి మీదుగా వెళ్లాలన్నారు.