కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రెండేండ్లలో వైద్య, ఆరోగ్యశాఖ తీసుకున్న జాగ్రత్తలతో కరోనా నియంత్రణలోకి వచ్చింది. అయితే కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్నతరుణంలో మోదీ సర్కార్ వ్యాక్సిన్ వేయడంలో నిర్లిప్తత వహించింది. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య శాఖ అప్రమత్తమైంది. బూస్టర్ డోస్ వేసేందుకు సిద్ధమైంది. పీహెచ్సీల్లో ప్రతిఒక్కరికీ గతంలో మాదిరిగా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టింది. గురువారం నుంచి టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ను విజయవంతం చేసేందుకుగానూ గత వారంలో దవాఖానల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. మొదటి, రెండో విడుత టీకాలు తీసుకున్న అందరూ బూస్టర్డోస్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆశలు, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 19 : కరోనా కేసులు పెరుగుతున్నాయి. సున్న స్థాయిలో ఉన్న కేసులు రెండంకెలకు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ బూస్టర్ డోస్లను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిపై ఇప్పటికే దవాఖానల్లో మాక్డ్రిల్ ని ర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ను పంపిణీ చేసేందుకు నిరాకరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నది. గురువారం నుంచి జిల్లాలో బూ స్టర్ డోస్ను వేయనున్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు చేరుకోగా.. గురువారం పీహెచ్సీలకు తరలించగా.. ప్రతిరోజూ టీకా ఇవ్వనున్నారు.
ఇప్పటికే ఒకటి, రెండో విడుత వ్యాక్సిన్లను వేయించుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. కొవిడ్ నియంత్రణ చర్యలను కొన్నేండ్లపాటు పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నది. కరోనా పూర్తిగా దూరం కాకపోవడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది. నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండడమే దీనికి నిదర్శనం. మొత్తమ్మీద వైద్య, ఆరోగ్య శాఖ మరోసారి జిల్లాలోనూ కరోనాపై అప్రమత్తం చేయనున్నది. గ్రామాల్లో ఆశలు, ఏఎన్ఎంల ద్వారా బూస్టర్ డోస్లపై అవగాహ న కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లాకు 5 వేల బూస్టర్ డోస్లు చేరుకున్నాయి. పీహెచ్సీలు, జిల్లా దవాఖాన, సీహెచ్సీల్లో బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచనున్నారు. ఇప్ప టివరకు నాగర్కర్నూల్ జిల్లాలో 104 శాతంతో 6,27,625 మం దికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అలాగే గతంలో జిల్లాలో 6,43,485 మందికిగానూ 68 శాతంతో 4,40,325 మందికి బూస్టర్ డోస్ టీకాలు వేశారు. ఇలా రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది.
18 ఏండ్లు పైబడిన వ్యక్తులు 6,51,252 6,50,561
15 నుంచి 17 ఏండ్లు 44,792 44,397
12 నుంచి 14 ఏండ్లు 27,880 27,500
మహబూబ్నగర్ జిల్లా..
12 నుంచి 14 ఏండ్లు 32,114 30,668
15 నుంచి 17 ఏండ్లు 51,151 50,511
18 ఏండ్లు పైబడిన వ్యక్తులు 7,22,444 7,36,483
నాగర్కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ టీకాలను ఇవ్వనున్నది. జిల్లాకు 5 వేల టీకాలు వచ్చాయి. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో గతంలో మాదిరిగానే బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టాం. రెండు డోసులు టీకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్
నేటి నుంచి పంపిణీ..
గురువారం నుంచి అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో బూస్టర్ డోస్ టీకాలను ఉచితంగా వేయనున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో టీకాలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్వో, మహబూబ్నగర్