ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఆకాంక్షను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చుతున్నది. ఇందులో భాగంగా జీవో 58, 59లను విడుదల చేసింది. మరింత అవకాశం కల్పించేందుకుగానూ ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించింది. 125 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. వీటికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సి ఉండదు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 125-135 చదరపు గజాల్లోని నిర్మాణాలకు ధరలో 25 శాతం, 500 గజాలకు 75 శాతం, 500 గజాలు దాటితే వంద శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2022లో సవరించిన భూముల విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజును నిర్మాణదారులు జమ చేయాలి. ఇప్పటికే స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ తుదిదశకు చేరగా.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నింపనున్నది.
నాగర్కర్నూల్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ప్ర భుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు జీవో నెం బర్ 58, 59 రూపంలో ప్రభుత్వం శుభవార్త అందించిం ది. కొన్నేండ్ల కిందట కట్టుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించుకునేందుకు గత నెల నుంచి దరఖాస్తులను స్వీకస్తున్నది. జీవో-58 ప్రకారం 125 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నది. అలాగే జీవో నెంబర్ 59 ప్రకారం 125 గజాలకుపైగా విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు నిర్ధేశించిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. 2022లో సవరించిన భూముల విలువల ప్ర కారం రిజిస్ట్రేషన్ ఫీజును నిర్మాణదారులు జమచేయాలి. దీని ప్రకారం విస్తీర్ణంతో సంబంధం లేకుండా నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాలి. దీనిద్వారా 125-135 చదరపు గజాల్లోని నిర్మాణాలకు ధరలో 25 శాతం, 500 గజాలకు 75 శాతం, 500 గజాలు దాటితే 100 శాతం రుసుముగా నిర్ణయించారు.
ఇందులో విద్యాసంస్థలు, దవాఖానలను వ్యాపార సంస్థలుగా పరిగణించనున్నది. ప్రభుత్వ అభ్యంతరం లేని రెవెన్యూ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాల్లో ఇండ్లను మా త్రమే క్రమబద్ధీకరించనున్నారు. కాగా దీనికి సంబంధించిన కటాఫ్ తేదీని సైతం పేదల సౌలభ్యం కోసం మా ర్చడం గమనార్హం. ఇంతకు ముందు 2014 వరకు ఇండ్ల ను మాత్రమే క్రమబద్ధీకరించనుండగా 2020 వరకు పెం చడం విశేషం. దీనివల్ల వేలాది మంది పేదలకు ప్రభుత్వ నిర్ణయంతో ఊరట కలగనున్నది. గతేడాదిలో ఓసారి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. ఇందులో దరఖాస్తుదారుడు ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు ఆస్తి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, తాగునీటి బిల్లు, రిజిస్టర్ డాక్యుమెంట్ల్లో ఏవైనా ఒకటి జతపర్చాలి. ఈ నెలాఖరు నాటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నది. కొన్ని రోజులు మాత్రమే మి గిలి ఉండడంతో ప్రక్రియను వేగం చేసేందుకు స్థానిక అ ధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఇప్పటికే కలెక్టర్లు ఆయా మండలాల వారీగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు ఉండాలనే దిశగా ప్రభుత్వం ముందు కు సాగుతున్నది. దరఖాస్తు గడువు పొడిగించడంతో నెలాఖరుకు అధిక సంఖ్యలో దరఖాస్తు లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తులను ప్రతిరోజూ ఆన్లైన్లో ప్రభుత్వ లాగిన్లో చేరుతున్నది. దరఖాస్తుల స్వీకరణ ముగిశాక విచారణ అనంతరం పూర్తిస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణను చేపట్టి పట్టాలను పంపిణీ చేయనున్నారు.
ఆన్లైన్లోనే దరఖాస్తులు..
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లను పరిశీలించనున్నాం. అనివార్య కారణాలతో ఇండ్లు కట్టుకున్న పేదలు, సామాన్యులకు ఈ జీవో ఊరటనిస్తున్నది. ఆ తరువాత ప్రభుత్వ సూచనల మేరకు క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటాం.
– జయంత్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్