మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై వెల్దొండ వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కారు డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.