మక్తల్టౌన్, నవంబర్ 5: తెలంగాణ ప్రజల భవిష్యత్ భద్రతగా ఉండాలంటే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి డా.ఆంజనేయగౌడ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతి విప్లవం వల్ల రాష్ట్రంలోని గ్రామాలకు గుండె ధైర్యం వచ్చిందన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సారథ్యంలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో భీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకొని చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్ల నుంచి 2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందించాలనే సంకల్పంతో 150పడకల దవాఖాన నిర్మాణానికి గతనెలలోనే భూమిపూజ చేశామన్నారు. నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ లెజెండ్ సీఎం కేసీఆర్ ప్రజలకు గొప్ప సందేశం ఇస్తారన్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల ప్రజలు వేలాదిగా తరలి రావాలన్నారు. ఈ నెల 30న జరిగేఎన్నికల్లో కారుగుర్తుపై ఓటువేసి, భారీమెజార్టీతో మక్తల్ అసెంబ్లీ సీటును కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. ప్రజా ఆశీర్వాద సభ మక్తల్ పట్టణ సమీపంలో కొత్తగార్లపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉంటుందనిన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, నాయకులు ఆశిరెడ్డి, చిన్నహన్మంతు, జయానంద్, లక్ష్మీ నారాయణ, మైమూద్, ఆనంద్శేఖర్, శేఖర్రెడ్డి, సాగర్, ఆనంద్, హుస్సేన్పాషా, కర్రెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఆదరించేందుకే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన48 మంది తెలంగాణ మాదిగ రిజర్వేషన్ సమితి (టీఎంఆర్పీఎస్ )నాయకులు సోమవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ గడ్డ ప్రజాశ్రేయస్సే తన లక్ష్యమని, నాకంఠంలో స్వాస ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటానన్నారు. ఎవరెవరో చెప్పే మాటలకు భయబ్రాంతులకు గురికాకుండా 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, ఆశిరెడ్డి, చిన్న హన్మంతు, సాగర్, నేతాజీ, ఈశ్వర్యాదవ్, కర్రెం కృష్ణ తదితరులు ఉన్నారు.
ఊట్కూర్, నవంబర్ 5: ఓట్ల కోసం గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతున్నదన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఓబ్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిని 45 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఆమర గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కారు గుర్తుకు ఓట్లేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.